ఓటీటీలోకి నయనతార 'Gold' మూవీ..

by Hamsa |   ( Updated:2022-12-25 03:57:41.0  )
ఓటీటీలోకి నయనతార Gold మూవీ..
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో పృథ్వీరాజ్ మారన్, నయనతార జంటగా నటించిన మలయాళ సినిమా 'గోల్డ్'. దీనిని ప్రేమమ్ ఫేమ్ డైరెక్టర్ ఆల్పోన్స్ పుత్రేన్ తెరకెక్కించాడు. ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్స్‌లో విడుదలై బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. గోల్డ్ మూవీ ప్రముఖ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తంలో కొనుగోలు చేసుకున్నట్టు సమాచారం. ఈ నెల 29న కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోను అందుబాటులోకి రానుంది. అయితే ప్రేమమ్ సక్సెస్ తర్వాత దాదాపు ఏడేళ్ల విరామం అనంతరం ఆల్పోన్స్ పుత్రేన్ దర్శకత్వం వహించిన సినిమా గోల్డ్. ఈ సినిమాను హీరో పృథ్వీరాజ్ నిర్మించాడు.

Also Read..

ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోతే Nagarjuna ఎందుకు వెళ్లరు?

Advertisement

Next Story

Most Viewed